Sunday, May 19, 2024

సముద్రంలో మునిగి ఐదుగురు వైద్య విద్యార్థులు మృతి..!!

spot_img

తమిళనాడులోని కన్యాకుమారిలో విషాదం నెలకొంది. వివాహవేడుకకు వచ్చిన ఐదుగురు సముద్రంలో మునిగి మరణించారు. మరణించినవారిలో ఇద్దరు మహిళలు ఉన్నారు. మరో ముగ్గురు మహిళలు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటన తమిళనాడులోని కన్యాకుమారిలో జరిగింది. తిరుచిరాపల్లిలోని ఎస్ఆర్ఎం మెడికల్ కాలేజీకి చెందిన పలువురు వైద్య విద్యార్థులు ఆదివారం ఓ పెళ్లివేడుకకు హాజరయ్యేందుకు కన్యాకుమారికి వచ్చారు. అనంతరం పర్యాటక ప్రాంతాలను సందర్శించేందుకు ఆ విద్యార్థులు పలు గ్రూపులుగా విడిపోయారు.

వీరిలో ఒక మెడికో గ్రూపు కన్యాకుమారి తీరంలో మూసి ఉన్న ప్రైవేట్ బీచ్ లో ఈత కోసం సముద్రంలోకి వెళ్లారు. అయితే అలలకు కొందరు విద్యార్థులు కొట్టుకుపోయారు. ఇందులో ఐదుగురు విద్యార్థులు మరణించారు. వీరంత తంజావురుకు చెందిన చారుకవి, నైవేలికి చెందిన గాయత్రి, కన్యాకుమారికి చ ెందిన సర్వదర్శిత్, దిండిగల్ కు చెందిన ప్రవీణ్ సామ్, ఏపీకి చెందిన వెంకటేశ్ గాగుర్తించారు.

మరో ముగ్గురు మహిళా మెడికోలు కరూర్ కు చెందిన నేషి, తేనికి చెందిన ప్రీతి, మదురైకి చెందిన శరణ్యను రక్షంచారు. ఆసారిపల్లం మెడికల్ కాలేజీ ఆసుపత్రికి వారిని తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరణించిన మెడికో విద్యార్థుల కోర్సు మరికొన్ని వారాల్లో ముగియనున్నదని తెలిపారు.

ఇది కూడా చదవండి: మాకు ఉచిత బస్సులు వద్దే వద్దు..కాళ్లు, చేతులు విరుగుతున్నాయ్.!

Latest News

More Articles