Sunday, May 19, 2024

పదిగంటల పాటు డంప్ యార్డ్ లో ధనుష్..!

spot_img

తమిళస్టార్ హీరో ధనుష్, నాగార్జున అక్కినేని ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా కుబేర. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో ఈ మూవీ రానుంది. ప్రస్తుతం ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుగుతోన్న ఈ సినిమాకు సంబంధించిన ఓవార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. అది చూసిన నెటిజన్లు ధనుష్ ను ప్రశంసిస్తున్నారు. ముంబైలోని అత్యంత పెద్ద డంప్ యార్డ్ లో షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఆ సన్నివేశాలు సహజంగా రావడం కోసం ధనుష్ పది గంటలపాటు మాస్క్ లేకుండా డంప్ యార్డ్ లో నటించారని సినీ వర్గాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాయి. దీంతో సినిమాలపై ఆయనకున్న నిబబద్ధతను చూసిన నెటిజన్లు కొనియాడుతున్నారు. దీనిలో ధనుష్ డీగ్లామరైజ్ పాత్రలో కనిపిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక నాగార్జున ఫస్ట్ లుక్ విడుదల చేయగా దానికి మంచి స్పందన లభించింది. సున్నితమైన అంశాలతో, మనసుల్ని హత్తుకునేలా కథలు చెప్పడం శేఖర్ కమ్ముల శైలి. కుబేరతో తనదైన శైలిలో ఫిలాసఫీ మరోసారి చెప్పబోతున్నారు. వాణిజ్య హంగులను మేళవంచి ఆయన తన మార్క్ కథ, కథనాలను తెరపై ఆవిష్కరించున్నారు. దీంతో ఈ మూవీలో ధనుష్, నాగార్జునల పాత్రలు ఎలా ఉండయనున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కొత్త కాన్సెప్ట్ తో రానున్న ఈ మూవీలో రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. ఈమధ్యే ఈ సినిమాపై ఆమె స్పందించారు. ఇంత మంచి ప్రాజెక్టులో పనిచేయడం చాలా సంతోషంగా ఉందన్నారు.

ఇది కూడా చదవండి: డిగ్రీ అర్హతతో 506 అసిస్టెంట్ కమాండెంట్​ పోస్టులు..!

Latest News

More Articles