Monday, May 20, 2024

శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం

spot_img

తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నిన్న స్వామివారిని  78,349 మంది భక్తులు దర్శించుకున్నారు. 39,634 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించినట్లు టీటీడీ అధికారులు తెలిపారు.

ఇదిలా ఉండగా.. నిన్న స్వామివారి హుండీ ఆదాయం 4.56 కోట్లు రాగా, సర్వదర్శనానికి 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచిఉన్నారు.  SSD టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని అధికారులు వెల్లడించారు.

Latest News

More Articles