Monday, May 20, 2024

ఒడిశాలో ప్రకృతి కన్నెర్ర.. 45 నిమిషాల్లో 21 వేల పిడుగులు

spot_img

ఒడిశాలో ప్రకృతి కన్నెర్ర చేసింది. నిన్న కురిసిన భారీ వర్షాలకు వేల కొద్దీ పిడుగులు పడ్డాయి. కోరాపుట్ జిల్లా బైపరిగుడ బోరెగుమ్మ, జైపూర్, కోరాపుట్, లంతాపూర్, సిమిలిగూడ, నంద పూర్, కుందుర అటవీ ప్రాంతాల్లో ఒకే రోజు వేలాది పిడుగులు పడినట్లు వాతావరణ అధికారులు గుర్తించారు. నిన్న కురిసిన భారీ వర్షాలకు 45 నిమిషాల్లోనే 21,091 పిడుగులు పడినట్లు ఒడిశా వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు ఇంత పెద్ద మొత్తంలో పిడుగులు పడ్డట్టు చరిత్రలో లేదని ఒరిస్సా వాతావరణ శాఖ అధికారి జ్ఞాన జీత్ త్రిపాఠి ప్రకటించారు.

Latest News

More Articles