మిచౌంగ్ తుపాను ఎఫెక్ట్ కారణంగా పలు విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు తెలిపారు విశాఖ ఎయిర్పోర్టు డైరెక్టర్. దీనికి సంబంధించి విశాఖ నుంచి 23 విమానాల సర్వీసులను రద్దు చేస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయాన్ని పూర్తిస్థాయిలో ఆపరేషన్లో ఉంచుతున్నాం. అత్యవసర సర్వీసులు, మళ్లింపుల కోసం ఏటీసీ 24 గంటలూ పని చేస్తుంది. రన్వే ఆధునీకీకరణ పనుల వల్ల రాత్రి 8 వరకే విమానాశ్రయంలో రాకపోకలకు అనుమతి ఇస్తున్నామని తెలిపారు ఎయిర్పోర్టు డైరెక్టర్.
ఇది కూడా చదవండి:
ఉద్యోగులకు జీతాలు ఇచ్చేందుకు ఇల్లు తాకట్టు పెట్టిన బైజూస్ ఫౌండర్