హైదరాబాద్: తెలంగాణ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) 2023 దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. పేపర్-1, పేపర్-2కు కలిపి మొత్తం 4.78 లక్షల దరఖాస్తులు అందాయని టెట్ కన్వీనర్ రాధారెడ్డి తెలిపారు.
పేపర్-1కు 2,69,557 లక్షల దరఖాస్తులు, పేపర్-2కు 2,08,498 లక్షల దరఖాస్తులు, రెండు పేపర్లకు 1,86,997 మంది అభ్యర్ధులు దరఖాస్తు చేసుకున్నారని వెల్లడించారు. సెప్టెంబరు 15న పరీక్ష నిర్వహించనున్నారు.
కాగా, గతేడాది జరిగిన టెట్ పరీక్షకు దాదాపు 6.28 లక్షల దరఖాస్తురాగా.. ఈసారి దరఖాస్తుల సంఖ్య లక్షన్నర వరకు తగ్గింది.