Monday, May 20, 2024

కుప్వారా ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతం

spot_img

జమ్మూకశ్మీర్ లో ఇవాళ(శుక్రవారం) భారీ ఎన్ కౌంటర్ జరిగింది. కుప్వారాలోని మచల్​ సెక్టార్ లో గల నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) సమీపంలో పోలీసులు, ఆర్మీ అధికారులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. ఈ ఎన్ కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఆపరేషన్ లో నియంత్రణ రేఖ ద్వారా పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి భారత్ లోకి చొరబడేందుకు ప్రయత్నిస్తున్న నలుగురు ఉగ్రవాదులను.. భద్రతా సిబ్బంది గుర్తించి వారిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఆ నలుగురు ఉగ్రవాదులు హతమైనట్లు కశ్మీర్ జోన్ పోలీసులు తెలిపారు.

Latest News

More Articles