హైదరాబాద్ లోని మణికొండలో విషాదం జరిగింది. తల్లీకూతుళ్లు ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లీ, కూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. చనిపోయిన వారిని అలువేలు (40), లాస్య (14) గా గుర్తించారు. మృతదేహాలను ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తత్మహత్య కు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.