Friday, May 17, 2024

శంషాబాద్ ఎయిర్పోర్టులో 5 కేజీల డ్రగ్స్ పట్టివేత. నలుగురు మహిళలు అరెస్ట్..!!

spot_img

హైదరాబాద్:  శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో డిఆర్ఐ అధికారులు భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. 5 కేజీల కొకైన్ ను స్వాధీనం చేసుకున్నట్టు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు. పట్టుబడిన డ్రగ్స్ విలువ బహిరంగ మార్కెట్లో 50 కొట్ల రూపాయలు ఉంటుందని అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: అమెరికాలో సూసైడ్ చేసుకున్న హైదరాబాద్ మహిళ

సింగపూర్ వయా ఢిల్లీ నుంచి డ్రగ్స్  తరలిస్తున్న ముఠాలోని నలుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. మహిళలు తమ సూట్ కేసులు,  హ్యాండ్ బ్యాగ్ లో బ్రౌన్ టేపు వేసిన డ్రగ్స్ బండిళ్లను తరలించారు. డ్రగ్స్ తరలిస్తున్న మహిళలను అరెస్ట్ చేసినట్టు డిఆర్ఐ అధికారులు వెల్లడించారు.

Latest News

More Articles