Tuesday, May 21, 2024

ముందు వెళ్తున్న ట్రక్కును ఢీకొన్ని కారు.. ఆరుగురు మృతి

spot_img

ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముజఫర్‌నగర్‌ జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును కారు బలంగా ఢీ కొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఢిల్లీ నుంచి హరిద్వార్‌ వెళ్తున్న కారు జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రక్కును వెనుక నుంచి బలంగా ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగమే ప్రమాదానికి కారణమని, ఘటనలో కారు తుక్కుతుక్కుయిందని అధికారులు వెల్లడించారు. బాధితులంతా ఢిల్లీలోని షహదారా వాసులుగా గుర్తించినట్లు చెప్పారు. ప్రమాద సమాచారాన్ని మృతుల కుటుంబాలకు అందించినట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు వెల్లడించారు.

Read Also: బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుపై మరోసారి దాడి

Latest News

More Articles