Sunday, May 19, 2024

టీ చేస్తుండగా సిలిండర్‌ పేలి ఆరుగురికి గాయాలు

spot_img

బీహార్‌ రాష్ట్రంలో ప్రమాదం జరిగింది. సీతామర్హి లోని ఓ ఇంట్లో ఎల్‌పీజీ సిలిండర్‌ పేలడం తో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. సీతామర్హిలోని ఓ ఇంట్లో ఉదయం టీ చేస్తుండగా పేలుడు జరిగింది. ముందుగా గ్యాస్‌ మొత్తం ఇంటికి వ్యాపించింది. ఇంట్లో దీపం వెలుగు కారణంగా పేలుడు చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఆరుగురు గాయపడ్డారు. వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేపట్టారు.

ఇది కూడా చదవండి: బోథ్‌ కు పెన్ గంగా నీళ్లు తీసుకొచ్చే బాధ్య‌త నాది

Latest News

More Articles