Friday, May 17, 2024

కర్నాటక అసెంబ్లీ ఎదుట ఒకే కుటుంబానికి చెందిన 8మంది ఆత్మహత్యాయత్నం..!

spot_img

కర్నాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన 8మంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటిచుకునే ప్రయత్నంచేశారు. అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకోని వారిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి తరలించారు. రుణ బకాయి రికవరీ చేసేందుకు తమ ఇంటికి బ్యాంకు అధికారులు వేలం వేసేందుకు వచ్చారని మనస్తాపం చెంది వీరంత ఆత్మహత్యకు యత్నించినట్లు తెలుస్తోంది.

ఇది కూడా చదవండి: ప్రయాణికులకు గుడ్ న్యూస్..త్వరలోనే అందుబాటులోకి మరిన్ని ఆర్టీసీ బస్సులు..!!

2016లో వీరు బెంగుళూరు సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి రూ. 50లక్షలు అప్పు తీసుకున్నారు. రూ. 95లక్షల వరకు తిరిగి చెల్లింది. వడ్డితో సహా ఇంకా చెల్లించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేస్తామని నోటీసులు పంపించడంతో మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ వార్త దేశవ్యాప్తంగా సంచలనం క్రియేట్ చేసింది.

Latest News

More Articles