Saturday, May 18, 2024

నేపాల్ లో నదిలోకి దూసుకెళ్లిన బస్సు

spot_img

నేపాల్‌ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ధడింగ్‌ జిల్లాలో ప్రయాణికులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి నదిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు గాయపడ్డారు.

ఖాట్మాండు నుంచి బెనీ హిల్లీ జిల్లా కు వెళ్తున్న బస్సు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న గజూరి వద్దకు అదుపుతప్పి త్రిశూలి నది లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 8 మంది ప్రాణాలు కోల్పోగా.. సుమారు 19 మంది గాయపడ్డారు.

నదిలో గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ధడింగ్ ఎస్పీ గౌతమ్ మిశ్రా తెలిపారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఆరుగురు పురుషులు ఉన్నట్లు ఆయన తెలిపారు.

Latest News

More Articles