Saturday, May 18, 2024

హయత్ నగర్‎లో 8వ తరగతి విద్యార్థి మిస్సింగ్

spot_img

హైదరాబాద్‎లో ఓ విద్యార్థి మిస్సైన ఘటన కలకలంరేపింది. హయత్ నగర్‎లోని నేతాజీ కాలనీకి చెందిన పర్వత రెడ్డి సాయి సంజయ్ అనే విద్యార్థి శ్రీ చైతన్య స్కూల్‎లో 8వ తరగతి చదువుతున్నాడు. కాగా.. నిన్న మంగళవారం సాయంత్రం 5 గంటల సమయంలో నోట్ బుక్ కొనుక్కుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత సంజయ్ తిరిగి ఇంటికి రాలేదు. దాంతో కంగారుపడిన తల్లిదండ్రులు కాలనీ మొత్తం వెతికారు. అయినా ఎక్కడా సంజయ్ ఆచూకీ లభించలేదు. దాంతో వెంటనే హయత్ నగర్ పోలీసులకు ఫిర్యాదుచేశారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. కాలనీలోని సీసీ కెమెరాలని పరిశీలించారు. ఓ కెమెరాలో సంజయ్ అటుగా వెళ్లడం రికార్డయింది. దాని ఆధారంగా సంజయ్ ఆచూకీ కోసం ప్రత్యేక టీమ్‎లని రంగంలోకి దించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: ఆరు గ్యారెంటీలకు అర్హులెవరు? అన్నింటికి ఒకే దరఖాస్తు చాలా? సవాలక్ష సందేహాలు

Latest News

More Articles