Tuesday, May 14, 2024

పద్శశాలి సమాజం కోసం పరితపించే వ్యక్తి సీఎం కేసీఆర్-సీఎం కేసీఆర్

spot_img

పద్శశాలి సమాజం రాజకీయంగా, ఆర్థికంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరముందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఈ సామాజికవర్గం అభివృద్ధి కోసం తన వంతు కృషి చేస్తానని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని వడ్డేపల్లి దయానంద్‌ గార్డెన్స్‌లో జిల్లా పద్మశాలీ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఈ కార్యక్రమంలో మంత్రి హరీష్ రావు పాల్గొని మాట్లాడారు. పద్శశాలి సామాజిక వర్గంలో పేదలకు డబుల్ బెడ్ రూమ్ లు ఇస్తామన్నారు. ఇక సీఎం కేసీఆర్ పద్మశాలి సమాజం అభివృద్ధి కోసం ఎంతో పరితపిస్తారని అన్నారు. పద్మశాలి సమాజం కోసం ఉద్యమించిన కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహాలను రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేస్తామన్నారు.

Latest News

More Articles