త్వరలోనే ట్విటర్ లో కొత్త ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి. రికమెండెడ్ vs ఫాలోడ్ ట్వీట్లను అటూ ఇటు తేలికగా కదల్చడం, యూజర్ ఇంటర్ఫేస్లో మార్పులు, ట్వీట్ వివరాల కోసం బుక్ మార్క్ బటన్, ట్వీట్లలో అక్షరాల సంఖ్య పెంచడం వంటి ఫీచర్లు అందుబాటులోకి తీసుకురానున్నట్లు ట్విటర్ అధినేత ఎలాన్ మస్క్ వెల్లడించారు. వచ్చే వారంలోపే ఇవి అందుబాటులోకి వస్తాయన్నారు.
ట్విటర్లో మరిన్ని ఆప్షన్లు అందుబాటులోకి రానున్నట్లు మస్క్ ప్రకటించడంపై యూజర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ట్విటర్ సంస్థలో ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉన్నది. ఇప్పటికే సగం మంది ఉద్యోగులపై వేటు వేసిన ఎలాన్ మస్క్.. తాజాగా డబ్లిన్, సింగపూర్ కేంద్ర కార్యాలయాల్లోని ఉద్యోగులను తొలగించినట్లు వార్తలు వచ్చాయి.