బీజేపీ సస్పెండ్ చేసిన గోషామహల్ ఎమ్యెల్యే రాజాసింగ్ వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ నుండి పోటీలోకి దిగుతారో అన్న అయోమయంలో తాజాగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పై ప్రశంసల వర్షం కురిపించారు. గోషామహల్ నియోజకవర్గంలో నిర్మించిన 120 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తలసాని, హోం మంత్రి మహమూద్ అలీ ప్రారంభించారు.
వారితో కలిసి రాజా సింగ్ రిబ్బన్ కట్ చేసి లబ్ధిదారులకు అందజేశారు. మంత్రి తలసాని బాగా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. తన మన అని బేధం లేకుండా తలసాని అన్న అందరి సమస్యలకు పరిష్కారం చూపుతున్నారని కొనియాడారు రాజాసింగ్.