Monday, May 20, 2024

సెల్లార్‎లో పడుకోబెట్టిన చిన్నారి మీది నుంచి దూసుకెళ్లిన కారు.. స్పాట్‏లో మృతి

spot_img

హయత్ నగర్‎లో దారుణం చోటు చేసుకుంది. చిన్నారిపై నుండి కారు వెళ్లడంతో ఆ చిన్నారి అక్కడికక్కడే మృతిచెందింది. వివరాలలోకి వెళ్తే… కర్ణాటకకు చెందిన కొడ్లి రాజు, కవిత దంపతులు బీఎన్ రెడ్డి నగర్ లో నివాసముంటూ భవన స్లాబ్ పనులు చేస్తుంటారు. బుధవారం పనుల నిమిత్తం హయత్ నగర్ పరిధిలోని లెక్చరర్ కాలనీలో పనుల కోసం వెళ్లారు. అక్కడ తమ మూడేళ్ల చిన్నారి లక్ష్మిని సెల్లార్ లో పడుకోబెట్టి పనులలో నిమగ్నమయ్యారు. అయితే ఆర్కిటెక్చర్ హరిరాం పాపను చూసుకోకుండా, కారును రివర్స్ తీశాడు. ఈ క్రమంలో కారు చిన్నారి మీద నుంచి వెళ్లింది. దాంతో లక్ష్మి అక్కడికక్కడే చనిపోయింది. సీసీ కెమెరాల్లో ప్రమాద దృశ్యాలన్నీ రికార్డయ్యాయి. సమాచారమందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని ఆ చిన్నారి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‎కు తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.

Latest News

More Articles