రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్కు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. సోదరి సౌమ్య జోగినిపల్లితో కలిసి హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లిన ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్ ట్విట్టర్ వేదిక ఫొటోలను షేర్చేశారు. అన్నాచెల్లెల్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండుగ అని పేర్కొన్నారు.
కాగా, అమ్మలోని మొదటి అక్షరం ‘అ’, నాన్నలోని చివరి అక్షరం ‘న్న’ కలిపితే ‘అన్న’ అంటూ మంత్రి కేటీఆర్తో ఉన్న ఫొటోను ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ఇక మంత్రి కేటీఆర్ ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెలిసిందే.