తెలంగాణలోని ఇంటర్ కాలేజీలకు ఇంటర్మీడియట్ బోర్డు సెలవులు ప్రకటించింది. ఈ నెల 30 నుంచి మే 31 వరకు సెలవులు కొనసాగనున్నాయి. జూన్ 1న కాలేజీలు మళ్లీ తెరుచుకోనున్నాయి. ఈ సెలవులు రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్ ఇంటర్మీడియట్ కాలేజీలకు వర్తించనున్నాయి.
ఇంటర్ బోర్డు ఆదేశాలను ఉల్లంఘించి కాలేజీలను నిర్వహించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు. వచ్చే అకాడమిక్ ఇయర్ కి ఇంటర్ బోర్డు ఆదేశాలకు అనుగుణంగా అడ్మిషన్లు తీసుకోవాలని, ఆ తేదీలను ప్రకటించినప్పుడే ప్రవేశాల ప్రక్రియ చేపట్టాలని సూచించారు బోర్డు అధికారులు.
ఇది కూడా చదవండి: 10th పాస్ అయ్యారా? మీకు గవర్నమెంట్ జాబ్ కొట్టే ఛాన్స్! అప్లై చేయండి!