నీట్ ఎగ్జామ్లో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు.దీనికి సంబంధించి ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. హై లెవల్ ఎక్స్ పర్ట్ కమిటీ ద్వారా విచారణ జరిపించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్కు సంబంధించిన కీలకమైన ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలన్నారు. వైద్య విద్యార్థుల జీవితాలను ప్రభావితం చేసే నీట్ ఎగ్జామ్కు సంబంధించిన కొన్ని వ్యవహారాలు చూస్తుంటే కచ్చితంగా అవకతవకలు జరిగినట్లు స్పష్టంగా అర్థమవుతోందన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది నీట్ ఎగ్జామ్లో 67 మంది విద్యార్థులు 720కి 720 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించటం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. దీంతో పాటు ఈ సారి చాలా మంది విద్యార్థులు 718, 719 మార్కులు సాధించారు. నీట్లో (+4, -1) మార్కింగ్ విధానం ఉంటుంది. ఈ లెక్కన 718, 719 మార్కులు రావటమనేది సాధ్యమయ్యే పనికాదన్నారు. దీని గురించి ప్రశ్నిస్తే ‘గ్రేస్ మార్కులు’ ఇచ్చామని చెబుతున్నారు. దీంతో కొంతమంది విద్యార్థులకు మాత్రం ఏకంగా 100 వరకు గ్రేస్ మార్కులు ఇచ్చినట్లు తెలుస్తోంది. గ్రేస్ మార్కుల కోసం ఏ విధానం అవలంభించారన్నది చెప్పకపోవటం ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. నీట్ ఫలితాలను ప్రిపోన్ చేసి ఎన్నికల ఫలితాల రోజే హడావుడిగా విడుదల చేయటం కూడా పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. నీట్ ఎగ్జామ్ విషయంలో బీఆర్ఎస్ తరపున కేంద్రానికి పలు పశ్నలతో పాటు కొన్ని డిమాండ్లు చేశారు కేటీఆర్.
ఇది కూడా చదవండి:రేపే గ్రూప్-1 ప్రిలిమ్స్: నిమిషం ఆలస్యమైనా అనుమతి లేదు
..గత ఐదేండ్లలో తెలంగాణ నుంచి ఏ విద్యార్థి కూడా నీట్లో టాప్ 5 ర్యాకింగ్లో లేరు. దీనికి కచ్చితంగా నీట్ ఎగ్జామ్లో జరుగుతున్న అక్రమాలే కారణం.
.. గ్రేస్ మార్కుల కేటాయింపు కోసం అనుసరించిన విధానాన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. ఒక ప్రామాణిక పద్దతిలో ప్రతి విద్యార్థికి మేలు చేసేలా ఈ విధానం ఉండాలని బీఆర్ఎస్ కోరుతోంది. కానీ 1500 మంది విద్యార్థుల గ్రూప్నకు మాత్రమే లాభం చేకూర్చేలా గ్రేస్ మార్కులు కలిపారు. అది సరైన విధానం కాదు.
.. ఈ మొత్తం వ్యవహారంపై హై లైవల్ ఎక్స్ పర్ట్ కమిటీతో విచారణ జరిపించాలి. అక్రమాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు కేటీఆర్.
I am sure the NDA Government has many challenges as they form a new Govt
But the one that deserves highest priority is the most sensitive issue pertaining to the future of millions of students; the Fiasco of #NEET2024result
Unlike previous years, this year a total of 67…
— KTR (@KTRBRS) June 8, 2024