కరీంనగర్లో దారుణం జరిగింది. ఇవాళ(సోమవారం) మార్కండేయ కాలనీలో భార్యను చంపి.. భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను హత్య చేసి తర్వాత భర్త ఉరి వేసుకుని ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తోంది.
మార్కెండయ్య కాలనీ లో నివాసముంటున్న భార్య వేముల లావణ్య (42)ను భర్త వేముల ప్రవీణ్ (50) హత్య చేశాడు. ఈ హత్య చేసి రెండు రోజులైంది.. అయితే ఎవరికీ తెలీయకుండా భార్య మృతదేహాన్ని ఇంటిలోనే దాచి పెట్టాడు. నిన్న(ఆదివారం) హస్టల్ లో ఉండి చదువుకుంటున్నన కుమార్తెను చూసి..ఇవాళ ఉదయం ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత అతడు ఉరి వేసుకుని చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్త చేపట్టారు.