హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో ఇవాళ(శనివారం) ఉదయం చేపమందు ప్రసాదం పంపిణి ప్రారంభమైంది. రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, స్పీకర్ గడ్డం శ్యాం ప్రసాద్, దానం నాగేందర్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయికుమార్, మేయర్ గద్వాల విజయలక్ష్మి లతో కలిసి కార్యక్రమాన్ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో చేపమందు ప్రసాదం పంపిణీని ప్రారంభించారు.చేప ప్రసాద పంపిణీ చేప ప్రసాదాన్ని ముందుగా దివంగత బత్తిన హరినాథ్ గౌడ్ కుమారుడు అమర్నాథ్ గౌడ్, సోదరుడు గౌరీ శంకర్లు మంత్రి పొన్నం ప్రభాకర్కు చేప మందును వేశారు.
మృగశిర కార్తె సందర్భంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బత్తిని కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో 150 ఏండ్లుగా చేప మందు పంపిణీ జరుగుతుందన్నారు మంత్రి పొన్నం. చాలా కాలంగా చేప మందు పంపిణీ విశ్వాసంతో ప్రజలు వేసుకుంటున్నారని తెలిపారు. అస్తమా, శ్వాస సంబంధిత వ్యాధిగ్రస్తులు ఈ ఫిష్ మెడిసిన్ వేసుకుంటారని, వివిధ రాష్ట్రాలు,దేశాల నుండి కూడా ఈ చేప ప్రసాదం కోసం ప్రజలు వస్తున్నారని తెలిపారు. వాళ్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలను ప్రభుత్వం కల్పించినట్లు తెలిపారు. ఈ పంపిణీ కార్యక్ఇమం రేపటి వరకు కొనసాగనుందన్నారు.
ఇది కూడా చదవండి:జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఈసీ శ్రీకారం