Saturday, May 18, 2024

ఏపీలో ఆటోను ఢీకొన్న లారీ.. తెలంగాణకు చెందిన ఐదుగురు కూలీలు మృతి

spot_img

ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లాకు చెందిన కూలీలను గురజాల మండలం పులిపాడుకు తీసుకెళ్తున్న ఆటోను లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతిచెందగా.. 10 మందికి గాయాలయ్యాయి. ఈ విషాదకర ఘటన దాచేపల్లి మండలం పొందుగల వద్ద చోటుచేసుకుంది.

ప్రమాద జరిగిన సమయంలో ఆటోలో 23 మంది కూలీలు ప్రయాణిస్తున్నట్లు తెలుస్తోంది. గాయపడ్డ వారిని గురజాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించామని, మృతులను నల్గొండ జిల్లా దామరచర్ల మండలం నర్సాపురం వాసులుగా గుర్తించామని తెలిపారు.  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.

మృతులు
ఇస్లావత్ ముజుల (25)
భూక్య పద్మ (27)
పానియా సక్ర (35)
భూక్య నాని (55)
మాలావత్ కలిత (30)

Latest News

More Articles