హైదరాబాద్ : కరెంట్ బిల్లు కట్టని ఓ ఇంటికి అధికారులు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో ఆ ఇంటి ఓనర్ విద్యుత్ శాఖ సిబ్బందిపై కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. ఈ ఘటన హైదరాబాద్లోని పాతబస్తీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతబస్తీ మీర్ చౌక్ పోలీసు స్టేషన్ పరిధిలో ఉంటున్న ఉమర్ చౌదరీ.. గత కొంతకాలం నుంచి కరెంట్ బిల్లులు కట్టడం లేదు.
Also Read.. యమునా ఎక్స్ ప్రెస్వే పై అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం: ఐదుగురు మృతి
దీంతో విద్యుత్ సిబ్బంది ఉమర్ ఇంటికి కరెంట్ కట్ చేశారు. ఈ క్రమంలో విద్యుత్ సిబ్బందిపై ఉమర్ కత్తితో దాడి చేసేందుకు యత్నించాడు. అక్కడే ఉన్న సిబ్బంది అడ్డుకొని.. నేరుగా మీర్ చౌక్ పోలీసు స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.