హైదరాబాద్ : మార్ఫింగ్ చేసిన ఫొటోలను ఉపయోగించి మహిళలను బ్లాక్ మెయిల్ చేసిన హుస్సేన్ ఆలంను పోలీసులు అరెస్ట్ చేశారు. మహిళల చిత్రాలను మార్ఫింగ్ చేసి ఫోర్న్ సైట్ లో అప్లోడ్ చేస్తానని బెదిరిస్తూ నిందితుడు బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని విచారణలో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. బాధితుల ఫిర్యాదుతో నిందితుడు హుస్సేన్ ఆలంను అరెస్ట్ చేసినట్లు సైబర్ క్రైమ్ పోలీసులు వెల్లడించారు.