సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం తలెల్మా శివారులో రోడ్డుప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, బైక్ ను ఢీకొన్న ఘటనలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాజ్ కుమార్ అక్కడికక్కడే మృతి చెండగా.. మరో ఉపాధ్యాయుడు సందీప్ కు తీవ్రగాయాలు అయినట్లు స్థానికులు, పోలీసులు తెలిపారు. వీరిద్దరూ తలెల్మా ప్రభుత్వ పాఠశాలలో ప్రభుత్వ ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్నారు. ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమే ఈ ప్రమాదానికి కారణం అని స్థానికులు తెలిపారు.