Monday, May 20, 2024

అమెరికాలోని చికాగోలో మరో తెలంగాణ విద్యార్థి ఆచూకీ గల్లంతు..!!

spot_img

అమెరికాలో మరో తెలంగాణ విద్యార్థి ఆచూకీ గల్లంతయింది. దీంతో వారి కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే భారత రాయబార కార్యాలయం దీనిపై ఒక ప్రకటన చేసింది. తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి విద్యార్థి రూపేష్ చంద్ర మే రెండవ తేదీ నుంచి కనబడుటలేదని, అమెరికాలోని చికాగో రాష్ట్రంలో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు ప్రకటనలో పేర్కొంది. విద్యార్థి ఆచూకీ కోసం స్థానిక పోలీసుల సహకారం తీసుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే అమెరికాలో భారతీయ సంతతికి చెందిన విద్యార్థులు ఇటీవల వరుసగా ప్రమాదాలకు గురికావడం తల్లిదండ్రుల్లో ఆందోళనలు రేకెత్తిస్తోంది. గత నెలలో కూడా హైదరాబాదుకు చెందిన ఓ విద్యార్థి ఆచూకీ గల్లంతైన తరువాత శవమై తేలాడు. ఈ ఏడాది దాదాపు 25 మంది విద్యార్థులు మరణించినట్లు ఒక నివేదికలో తేలింది.

కాగా చికాగోలో అదృశ్యమైనటువంటి విద్యార్థి చింతకింది రూపేష్ చంద్ర ఆచూకీ కోసం పోలీసులతోనూ నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. త్వరలోనే రూపేష్ చంద్ర ఆచూకీ లభ్యమయ్యే అవకాశం ఉందని రాయబార కార్యాలయం ఆశాభావం వ్యక్తం చేసింది ఇదిలా ఉంటే.రూపేశ్​ ప్రస్తుతం విస్కాన్సిన్​లోని కాంకార్డియా యూనివర్సిటీలో మాస్టర్స్​ చదువుతున్నాడు. తరచుగా భారతీయ విద్యార్థులపై ఇటువంటి దాడులు జరుగుతున్న నేపథ్యంలో యూనివర్సిటీ అధికారులు విద్యార్థుల భద్రతపై మరింత కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. విదేశీ విద్యార్థుల రక్షణ కోసం యూనివర్సిటీ నిర్వాహకులు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని బాధిత తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: కన్నప్ప మూవీ నుంచి క్రేజీ అప్ డేట్..ప్రభాస్ ఫొటో షేర్ చేసిన విష్ణు.!

Latest News

More Articles