Monday, May 20, 2024

నందిన‌గ‌ర్ ఇంటికి చేరుకున్న కేసీఆర్

spot_img

హైద‌రాబాద్ : సోమాజిగూడ య‌శోద ఆస్ప‌త్రి నుంచి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. అనంతరం నేరుగా నందిన‌గ‌ర్‌లోని త‌న సొంతింటికి వెళ్లారు. సొంతింటికి చేరుకున్న కేసీఆర్‌కు సాంప్ర‌దాయ ప‌ద్ధ‌తిలో దిష్టి తీసి కుటుంబసభ్యులు స్వాగతం పలికారు.

కేసీఆర్‌కు ఎడమకాలి తుంటి ఫ్రాక్చర్ కాగా, యశోద ఆస్ప‌త్రిలో ఆయ‌న‌కు శ‌స్త్ర చికిత్స నిర్వ‌హించారు. వారం రోజుల పాటు చికిత్స పొందిన కేసీఆర్‌ శుక్ర‌వారం ఉద‌యం డిశ్చార్జ్ అయ్యారు. ఈ సందర్భంగా తనకు చికిత్స అందించిన డాక్టర్లు, నర్సులు సహా యశోద సిబ్బందికి కేసీఆర్ పేరు పేరునా ధన్యవాదాలు తెలిపారు. అలాగే తన కోసం వచ్చిన అభిమానులకు అభివాదం చేశారు.

Latest News

More Articles