నాగర్కర్నూల్ : అప్పుడే పుట్టిన మగ శిశువును గుర్తు తెలియని వ్యక్తులు చెత్తకుప్పలో పడేశారు. ఈ అమానవీయ ఘటన నాగర్కర్నూల్ జిల్లాలోని తెలకపల్లి మండలం తాళ్లపల్లిలో జరిగింది శిశువు ఏడుపును గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు.
Also Read.. చావు కష్టాలు.. అంత్యక్రియల్లో స్నానం చేద్దాం అంటే కరెంట్ కట్
ప్రాణాలతో ఉన్న శిశువును నాగర్కర్నూల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ప్రస్తుతం శిశువు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.