Sunday, May 19, 2024

నగరంలో నడిరోడ్డు మీద రౌడీషీటర్ మర్డర్

spot_img

హైదరాబాద్ మహానగరంలో నడిరోడ్డు మీద, అందరూ చూస్తుండగానే ఓ రౌడీషీటర్ మర్డర్ జరిగింది. ఈ ఘటన బజార్ ఘాట్ లో బుధవారం రాత్రి చోటుచేసుకుంది.

మాసబ్ ట్యాంక్‎లోని ఫస్ట్సులాన్సర్‎కు చెందిన మహమ్మద్ ఫిర్దోష్, ఎజాష్ ఇద్దరూ స్నేహితులు. నిన్న రాత్రి ఫిర్దోష్ బైకు మీద వస్తుండగా.. ఎజాష్ కత్తితో దాడిచేశాడు. కత్తితో ఎక్కడపడితే అక్కడ విచక్షణారహితంగా పొడవడంతో ఫిర్దోష్‎కు తీవ్రగాయాలయ్యాయి. ఫిర్దోష్ వెనుకనుంచి వస్తున్న అతని స్నేహితులు వెంటనే ఆటోలో ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే చనిపోయాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. గతంలో ఇరువురిపై బంజారాహిల్స్‎తో పాటు పలు పోలీసుస్టేషన్‎లలో కేసులు ఉన్నాయి. ఈ హత్యకు పాత కక్షలే కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు. గతంలో ఇద్దరూ కలిసి పలు నేరాలు చేసినట్లు సమాచారం.

Latest News

More Articles