రంగారెడ్డి జిల్లాలో రన్నింగ్ కారులో మంటలు వచ్చాయి. రాజేంద్రనగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేపై పిల్లర్ నెంబర్ 144 వద్ద స్కోడా కారులో మంటలు చెలరేగాయి. సులేమాన్ నగర్కు చెందిన ఐదుగురు వ్యక్తులు మెహిదిపట్నం నుంచి శంషాబాద్ వైపు వెళుతుండగా.. ఒక్కసారిగా కారులో మంటలు వచ్చాయి. వెంటనే కారును ఆపి, అందరూ కిందికి దిగారు. కాగా.. ఈ ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధం అయింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.