భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు హనుమాన్ టెంపుల్ దగ్గర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ద్విచక్ర వాహనాన్ని పెండ్లి బస్సు ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న సోమలక్ష్మి అనే మహిళ అక్కడక్కడే మృతి చెండగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి.
గాయపడ్డ వ్యక్తిని 108 ద్వారా మణుగూరు లోని ప్రభుత్వ హాస్పిటల్ తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పెండ్లి బస్సు సూర్యాపేట నుండి మణుగూరుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.