Sunday, May 19, 2024

బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్‌ పై దాడి

spot_img

హైదరాబాద్‌లోని వెంగళరావునగర్‌లో బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్ దేదీప్యారావు, ఆమె భర్తపై నిన్న(మంగళవారం) రాత్రి కొందరు గుర్తు తెలియని మహిళలు దాడిచేశారు. కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్ ఇంటి బయట ఉన్న ఫ్లెక్సీలను తొలగించాలని డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (డీఆర్ఎఫ్)ను ఆమె ఆదేశించడమే ఈ గొడవకు కారణంగా తెలుస్తోంది.

కాంగ్రెస్ నేత మద్దతుదారులైన మహిళలు వెంగళరావునగర్ చేరుకుని ఆమెతో వాగ్వివాదానికి దిగారు. అప్రమత్తమైన దేదీప్యారావు మద్దతుదారులు అక్కడకు చేరుకోవడంతో గొడవ మరింత ముదిరి ఇరు వర్గాలు భౌతికదాడికి దిగాయి. ఈ గొడవతో కారు నుంచి కిందకు దిగిన కార్పొరేటర్‌ దేదీప్యారావు పైనా మహిళలు దాడి చేశారు. ఈ ఘటనపై కేసునమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు  చేపట్టారు.

ఇది కూడా చదవండి:  అదృశ్యమైన వరుడి మృతదేహం లభ్యం

Latest News

More Articles