Sunday, May 19, 2024

యజమాని తిట్టాడని పెట్రోల్ పోసుకున్న వర్కర్

spot_img

వరంగల్ జిల్లాలో దారుణం జరిగింది. యజమాని తిట్టాడని ఓ వర్కర్ పెట్రోల్ పోసుకున్నాడు. మేడిపల్లి సతీష్ అనే యువకుడు కరీమాబాద్‎లోని ఓ బార్‎లో పనిచేస్తున్నాడు. అయితే బార్ యజమాని.. తన వద్ద పనిచేసే సిబ్బందిని మేడారం జాతరకు తీసుకెళ్లాడు. అక్కడ సిబ్బందిని యజమాని మందలించాడు. దాంతో మనస్థాపానికి గురైన సతీష్.. ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యయత్నం చేశాడు. తీవ్రగాయాలపాలైన సతీష్‎ను.. తోటివారు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరిశీలించిన వైద్యులు.. సతీష్ శరీరం 80 శాతం కాలిపోయినట్లుగా తెలిపారు. ప్రస్తుతం సతీష్ ఆరోగ్యం విషమంగా ఉందని డాక్టర్లు చెప్పారు. కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

Read Also: పుట్టగానే అమ్మేసిన తండ్రి.. 19 ఏళ్ల తర్వాత కలిసిన కవలలు

Latest News

More Articles