Friday, May 17, 2024

ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకం

spot_img

హైదరాబాద్: ఫిలింనగర్ లో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. వివాహితను కిడ్నాప్ చేసి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసిన ప్రేమోన్మాది.. ఆ ప్రయత్నంలో అడ్డొచ్చిన భర్తను దారుణంగా హత్య చేసి పారిపోయాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫిలింనగర్ లో నివాసం ఉండే గౌస్ అనే వ్యక్తి తన భార్యను ఉన్నత చదువుల కోసం లండన్ కు పంపాడు. అక్కడ చదువుకునే రోజుల్లో అద్నాన్ అనే వ్యక్తితో సాన్నిహిత్యం ఏర్పడింది.

చదువు పూర్తయిన తర్వాత తిరిగి హైదరాబాద్ వచ్చిన వివాహితను అద్నాన్ వేధింపులకు గురిచేసాడు. ఇద్దరి మధ్య ఉన్న సానిహిత్యంతో  తీసుకున్న ఫోటోలను చూపెట్టి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డాడు. తనను వివాహం చేసుకోకపోతే ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానంటూ బెదిరింపులకు దిగాడు.

కానీ, భర్తను విడిచి రాలేనని వివాహిత తెగేసి చెప్పింది. వివాహిత ఇంటికి వచ్చి కిడ్నాప్ చేసేందుకు అద్నాన్ ప్రయత్నించాడు. అడ్డం వచ్చిన ఆమె భర్త గౌస్ ని కిరాతకంగా చంపి అద్నాన్ పారిపోయాడు. కేసు నమోదు చేసుకుని ప్రేమోన్మాది అద్నాన్ తో పాటు మరొకరిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు.

Also Read.. రాష్ట్రానికి మరో కీలక అవార్డు.. కేసీఆర్ పాలనలో తెలంగాణదే ఫస్ట్ ప్లేస్

Latest News

More Articles