హైదరాబాద్: ఆధార్లో పుట్టినతేదీ, చిరునామా, పేరులో మార్పులను ఆన్లైన్ ద్వారా జూన్ 14వరకు ఉచితంగా మార్చుకోవచ్చు. ఈ మేరకు భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్) అవకాశం కల్పించింది. మైఆధార్ పోర్టల్ వెబ్ సైట్ ద్వారా ఈ సేవలు పొందవచ్చని తెలిపింది. లేదా ఆధార్ సేవా కేంద్రాల ద్వారా రూ.50 చెల్లించి మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది.