తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై హైవే పై ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. రెండు లారీలు, రెండు బస్సులు, రెండు కార్లు ఒకదాని వెనుకల ఒకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. మృతులను కారులో ఉన్న ఆర్సీ బుక్ ప్రకారం గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతులంతా నంగల్లూరికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.