Friday, May 17, 2024

తమిళనాడులో ఘోర ప్రమాదం. ఆరుగురి మృతి

spot_img

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తిరుచ్చి-చెన్నై హైవే పై ఆరు వాహనాలు ఒకదానికొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో ఓకే కుటుంబానికి చెందిన ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. రెండు లారీలు, రెండు బస్సులు, రెండు కార్లు ఒకదాని వెనుకల ఒకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న వారంతా మృతి చెందారు. మృతులను కారులో ఉన్న ఆర్సీ బుక్ ప్రకారం గుర్తించారు. వారి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతులంతా నంగల్లూరికి చెందిన వారని పోలీసులు తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Latest News

More Articles