Sunday, May 12, 2024

పీవీఎన్ఆర్ ఎక్స్‎ప్రెస్ వేపై ప్రమాదం.. ఒకదానితో ఒకటి ఐదు కార్లు ఢీ

spot_img

పీవీఎన్ఆర్ ఎక్స్‎ప్రెస్ వేపై ప్రమాదం జరిగింది. రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని శివరాంపల్లి సమీపంలో పీవీఎన్ఆర్ ఎక్స్‎ప్రెస్ వేపై మిని లారీ డివైడర్ ఢీకొని బోల్తాపడింది. ఈ క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఐదు కార్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. దీంతో పీవీఎన్ఆర్ ఎక్స్‎ప్రెస్ వే మీద భారీగా ట్రాఫిక్ జాం అయింది. ఈ రోజు శనివారం కావడంతో ఐటీ ఆఫీసులు లేకపోవడం ఒకవిధంగా ట్రాఫిక్ జాంను తగ్గించింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వాహనాలను తొలగించి, రూట్ క్లియర్ చేశారు.

Latest News

More Articles