Saturday, May 4, 2024

ఆ మహిళపై అత్యాచారానికి పాల్పడింది సంగారెడ్డి యువకులు.!

spot_img

కూకట్ పల్లి వైజంక్షన్ లోని ఓ భవనం సెల్లారులోని షట్టరు ముందు ఆదివారం తెల్లవారుజామున చిత్తు కాగితాలు ఏరుకునే గుర్తి తెలియని మహిళపై అత్యాచారం చేసి ఇద్దరు యువకులు పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనకు కారణమైన నిందితులను పోలీసులు గుర్తించారు. ఈ దారుణానికిపాల్పడిన ఇద్దరు యువకులు సంగారెడ్డికి చెందిన వారుగా పోలీసుల విచారణలో తేలింది. సీసీఫుటేజీలఆధారంగా నిందితులు ఉపయోగించిన ద్విచక్ర వాహనాన్ని గుర్తింపు దర్యాప్తు చేపట్టడంతో నిందితుల ఆచూకీ లభించింది. వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు.

ఆ యువకులు సంగారెడ్డిలోనే ఓ బార్లో పనిచేస్తున్నట్లు పోలసులు తెలిపారు. బార్ లో అర్థరాత్రి వరకు పనిచేసివారు బాగా మద్యం తాగి ద్విచక్రవాహనంపై వైజంక్షన్ ప్రాంతానికి చేరుకున్నారు. ఆ సమయంలో అటుగా నడుచుకుంటూ వచ్చిన బాధితురాలిపై అత్యాచారానికి ఒడిగట్టారు. ఆమె మూసాపేటలో ఉండేందని ..ఆరు నెలల క్రితం ఓ వాహన షోరూంలో స్వీపర్ గా పనిచేసేదని తెలిపింది. అయితే అక్కడిసిబ్బందిని విచారించగాఆమె చిరునామా మాత్రం తెలియలేదు.

ఇది కూడా చదవండి: సమిష్టిగా కృషి చేస్తే కరీంనగర్ పార్లమెంట్ మనదే

Latest News

More Articles