Saturday, May 18, 2024

ఫ్యాన్స్‎కు కోటి రూపాయలు పంచుతానన్న విజయ్ దేవరకొండ

spot_img

విజయ్ దేవరకొండ, సమంత హీరోహీరోయిన్లుగా నటించిన ఖుషి చిత్రం సెప్టెంబర్ 1 విడుదలై పాజిటివ్ టాక్‎తో దూసుకుపోతోంది. ఈ సినిమా మూడు రోజుల్లో రూ. 70 కోట్లు రాబట్టింది. దాంతో ఖుషి టీమ్ ఫుల్‌ జోష్‌లో ఉంది. అయితే సినిమా సక్సెస్ కావడంతో సోమవారం వైజాగ్‎లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ మాట్లాడుతూ.. కొందరు డబ్బులిచ్చి మరీ మా సినిమాపై నెగెటివిటీ తీసుకొస్తున్నారన్నారు. సినిమా మీద ఫేక్‌ రేటింగ్స్‌ ఇప్పించారన్నారు. అయినా కూడా నా మీద ఉన్న ప్రేమతో సినిమాను చూసి విజయవంతం చేశారన్నారు. ఈ సంతోషంలో విజయ్ అభిమానుల కోసం ఓ ప్రకటన చేశాడు. ఈ సినిమా ద్వారా వచ్చే ఆదాయంలో ఒక కోటి రూపాయలను ఓ వంద కుటంబాలకు పంచుతానని వెల్లడించాడు. వంద కుటుంబాలను ఎంపిక చేసి వారికి ఒక్కో కుటుంబానికి రూ.లక్ష చొప్పున చెక్కును వారం పదిరోజుల్లో అందజేస్తానని విజయ్‌ దేవరకొండ వెల్లడించారు.

శివ నిర్వాణ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ తెరకెక్కించింది. పాన్ ఇండియా సినిమాగా విడుదలైన ‘ఖుషి’.. సక్సెస్ ఫుల్‎గా దూసుకెళ్తోంది.

Latest News

More Articles