హైదరాబాద్: భువనగిరి జడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై జరిగిన దౌర్జన్యాన్ని ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత తీవ్రంగా ఖండించారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి అహంకారం తలకు ఎక్కిందని విమర్శించారు. గతంలో భువనగిరి ఎంపీగా వున్నప్పుడు ఒక్క నాడు పార్లమెంటు నియోజకవర్గం అభివృద్ధి కోసం మాట్లాడ లేదని అన్నారు. ఈ రోజు మంత్రిగా ఒక మంత్రి సమాన హోదా కలిగిన వ్యక్తిని అవమానించారని మండిపడ్డారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం అయితే సహించేది లేదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యవాదులు ఈ విషయాన్ని తీవ్రంగా ఖండించాలని కోరారు.