Tuesday, May 21, 2024

రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తా అంటున్న ఎమ్మెల్యే అభ్యర్థి

spot_img

తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తుండటంతో రాజకీయంగా వేడెక్కింది. ఆయా పార్టీల అభ్యర్థులు తమతమ ప్రచారంలో నిమగ్నమయ్యారు. నియోజకవర్గాల్లో తిరుగుతూ.. ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. కాగా.. తాజాగా ఓ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్నికల కోసం ఆశర్యకరమైన వాగ్ధానాలు చేస్తున్నాడు. కుమ్మరి వెంకటేశ్ యాదవ్ అనే వ్యక్తి ఆలిండియా ఫార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున సనత్ నగర్ నియోజకవర్గం నుంచి నామినేషన్ వేశాడు. ఆయన ఎన్నికల ప్రచారంలో కళ్లు చెదిరే ఆఫర్లు ప్రకటిస్తున్నాడు. తనను గెలిపిస్తే విద్య, వైద్యం, న్యాయ సేవలు.. ఇలా ఏదైనా సరే రూపాయికే అందిస్తానని హామీ ఇస్తున్నాడు. రూపాయికే నాలుగు సిలిండర్లు ఇస్తానని, ఇంట్లో ఒంటరిగా ఉండే వృద్ధుల కోసం ప్రత్యేక పథకం తీసుకొస్తానని ప్రకటించాడు. ప్రతి వంద ఇండ్లకు ఓ వాలంటీర్‎ను నియమించి, ఇంట్లో అమర్చిన పానిక్ బటన్ నొక్కగానే వచ్చి సేవలందించే ఏర్పాట్లు చేస్తానని చెబుతున్నాడు. మిగతా పార్టీల అభ్యర్థులను ఓడించి తనను గెలిపిస్తే ఈ హామీలన్నీ అమలు చేస్తానని అంటున్నాడు. అసాధ్యమైన హామీలతో కుమ్మరి వెంకటేశ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్‎లో ఉన్నాడు.

Read Also: హైదరాబాద్‎లో డబుల్ డెక్కర్ బస్సుల్లో ఉచిత ప్రయాణం

Latest News

More Articles