Friday, May 3, 2024

మీడియాపై నోరు పారేసుకున్న యాంకర్ సుమ

spot_img

యాంకరింగ్‎లో తనదైన శైలితో సుమ ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. తెలుగు ఇండస్ట్రీలో ఏ సినిమా ప్రోగ్రాం జరిగినా సుమ వ్యాఖ్యతగా వ్యవహరిస్తుంటారు. కాగా.. తాజాగా జరిగిన ఓ సినిమా ఫంక్షన్‎లో సుమ మీడియా మీద నోరు జారారు. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలల జంట తెరకెక్కుతున్న సినిమా ‘ఆదికేశవ’. ఈ సినిమాలోని ‘లీలమ్మో’ పాట విడుదల వేడుకను చిత్ర బృందం హైదరాబాద్‌లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి సుమ యాంకర్‌గా వ్యవహరించారు. అక్కడ సుమ మాట్లాడుతూ మీడియా వారు స్నాక్స్‌ను భోజనంలా తింటున్నారని సరదగా అన్నారు. ఆ విషయాన్ని ఓ విలేకరి సీరియస్‎గా తీసుకొని, ఆమె అలా అనకుండా ఉంటే బాగుండేదని అభిప్రాయం వ్యక్తం చేశారు. దాంతో సుమ మాట్లాడుతూ.. మీడియా వారంతా తనతో చాలాకాలంగా కలిసి ప్రయాణిస్తున్నారని, ఆ చనువుతోనే సరదగా అన్నానని సమాధానమిచ్చారు. ఆ తర్వాత ‘మీరు స్నాక్స్‌ను స్నాక్స్‌లానే తిన్నారు.. ఇప్పుడు ఓకేనా?’ అని సుమ అడగడంతో.. ‘ఇదే వద్దనేది. మీ యాంకరింగ్‌ అందరికీ ఇష్టమేగానీ మీడియా విషయంలో ఇలాంటివి వద్దు’ అని సదరు విలేకరి ఘాటుగా సమాధానమిచ్చారు. అప్పుడే వేదికపై క్షమాపణలు కోరిన సుమ తాజాగా వీడియో విడుదల చేశారు.

Read Also: కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని మరోసారి రుజువైపోయింది

‘మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈ రోజు నేనొక ఈవెంట్‌లో చేసిన వ్యాఖ్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాయని నాకు అర్థమవుతోంది. నిండు మనసుతో క్షమాపణ కోరుతున్నా. మీరెంత కష్టపడి పనిచేస్తారో నాకు తెలుసు. మీరు, నేను కలిసి కొన్నేళ్ల నుంచి ప్రయాణిస్తున్నాం. నన్ను ఓ కుటుంబ సభ్యురాలిగా భావించి క్షమిస్తారని ఆశిస్తున్నా’ అని వీడియో విడుదల చేసింది.

Latest News

More Articles