Monday, May 20, 2024

విద్యార్థులకు గుడ్‎న్యూస్.. సంక్రాంతి సెలవులు పొడిగింపు

spot_img

రెండు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఘనంగా జరుపుకున్నారు. పండుగ సెలవులు ముగియడంతో ఊర్లకు వెళ్లిన వారందరూ తిరుగుపయనమవుతున్నారు. పండుగ సందర్భంగా ఏపీలో ఈ నెల 17 వరకు సెలవులు ఇచ్చారు. అయితే తాజాగా స్కూళ్లకు సంక్రాంతి సెలవులు పొడిగిస్తున్నట్లు విద్యాశాఖ నిర్ణయం తీసుకుంది. సెలవులను మరో మూడు రోజులు పొడిగిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది. తల్లిదండ్రులు, టీచర్ల విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నెల 18, 19, 20 తేదీలను సెలవులుగా ప్రకటించారు. ఈ నెల 21న ఆదివారం వస్తుండటంతో ఆ తర్వాత 22 నుంచి స్కూళ్లు ప్రారంభంకానున్నాయని విద్యాశాఖ తెలిపింది. అయితే ఈ అదనపు సెలవులకు బదులుగా రెగ్యులర్‎గా వచ్చే సెలవుల్లో రెండు రోజులు స్కూళ్లు పనిచేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.

Read Also: మహిళతో సంబంధం పెట్టుకొని, ఆమె కూతురుని రేప్ చేసిన యువకుడు

Latest News

More Articles