ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం జిల్లాలో ఆదివారం సాయంత్రం హౌరా-చెన్నై లైన్లో రెండు రైళ్లు ఢీకొన్న ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 12 కి చేరుకుంది. 32 మంది గాయపడ్డారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఆదివారం సాయంత్రం 7 గంటల ప్రాంతంలో కంకట్పల్లి వద్ద పలాస ప్యాసింజర్ రాయగడ ప్యాసింజర్ రైలును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో మూడు కోచ్లు పట్టాలు తప్పడంతో పెద్ద ప్రమాదం జరిగిందని ఈస్ట్కోస్ట్ రైల్వే (ఈసీఆర్) సీనియర్ అధికారి తెలిపారు. విజయనగరం కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఈ రైలు ప్రమాదంలో ఇప్పటివరకు 12 మంది మృతి చెందగా, 32 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను విశాఖపట్నం, విజయనగరం ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు.
బాధితులకు కేంద్ర ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ప్రకటించిందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ట్విట్టర్ (x)లో పోస్ట్ చేశారు. క్షతగాత్రులందరినీ ఆసుపత్రులకు తరలించామని, మరణించినవారి కుటుంబాలుకు రూ.10 లక్షలు, తీవ్ర గాయాలపాలైన వారికి రూ.2 లక్షలు, స్వల్ప గాయాలకు రూ.50 వేలు ఎక్స్గ్రేషియా పరిహారంగా అందజేస్తామని తెలిపారు.అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఈ ఘటనపై విచారం వ్యక్తం చేస్తూ పరిహారం ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఎక్స్గ్రేషియా ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారు. అధికారిక ప్రకటన ప్రకారం, మరణించిన వారి బంధువులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన గాయపడిన వారికి రూ. 50,000 పరిహారం కూడా ప్రకటించారు.
#WATCH | Andhra Pradesh train accident: Rescue operations continue in Vizianagaram district.
As per the data, 9 casualties are there and 29 people have been injured: Biswajit Sahu, CPRO, East Coast Railway. pic.twitter.com/vTT5808GhE
— ANI (@ANI) October 30, 2023
మానవ తప్పిదం, సిగ్నల్ పట్టించుకోకపోవడం వల్లే ఈ రైలు ప్రమాదం జరిగి ఉండొచ్చని ఈస్ట్ కోస్ట్ రైల్వే తెలిపింది. రైలు నంబర్లు 08532 (విశాఖపట్నం-పలాస ప్యాసింజర్), 08504 (విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ స్పెషల్) ఢీకొన్నాయని ఈసీఆర్ చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ (సీపీఆర్వో) బిశ్వజిత్ సాహు తెలిపారు. ప్యాసింజర్ సిగ్నల్ దాటి రాయగడ వెళ్లారని తెలిపారు. ఈ కారణంగా విశాఖపట్నం-పలాస ప్యాసింజర్ రైలు వెనుక రెండు కోచ్లు, విశాఖపట్నం-రాయగడ ప్యాసింజర్ రైలు ఇంజన్ పట్టాలు తప్పాయి. సంఘటనా స్థలంలో DRM వాల్టెయిర్, అతని బృందంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రమాదం తర్వాత రిలీఫ్ రైళ్లు, ఇతర రెస్క్యూ పరికరాలను మోహరించినట్లు అధికారి తెలిపారు.
#WATCH | Andhra Pradesh train accident: Rescue operations continue in Vizianagaram district.
“As per the data, 9 casualties are there and 29 people have been injured…,” says Biswajit Sahu, CPRO, East Coast Railway. pic.twitter.com/N3adqmASxx
— ANI (@ANI) October 29, 2023
#WATCH | Drone visuals of the train collision in Vizianagaram, Andhra Pradesh. Rescue operations underway pic.twitter.com/ou24l03HP1
— ANI (@ANI) October 30, 2023