లాటిన్ అమెరికా దేశం ఈక్వెడార్లో డ్రగ్ ముఠా బీభత్సం సృష్టించింది. టెలివిజన్ స్టూడియోలోకి ఓ గ్యాంగ్ ఆయుధాలతో ప్రవేశించింది. లైవ్లోనే తమ వద్ద ఉన్న గన్స్తో బెదిరించింది. ముసుగులు వేసుకున్న ఆ గ్యాంగ్.. ప్రభుత్వ టీవీ ఛానల్ టీసీ స్టూడియోలోకి ఎంటర్ అయ్యింది. ఈ ఘటన గుయాకుల్ సిటీలో జరిగింది. టీవీ స్టూడియోలో పనిచేస్తున్న ఉద్యోగుల్ని ఫ్లోర్పై పడుకోబెట్టారు. అనేక మందిని బందీలేగా చేశారు. ఓ సాయుధుడు తన వద్ద ఉన్న షాట్గన్ను టీవీ ప్రజెంటర్ తలపై పెట్టి బెదిరించాడు. ఇదంతా టీవీలో లైవ్ ప్లే అయ్యింది. అందరూ శాంతించాలని లేకుంటే బాంబులు వేస్తామని మరో సాయుధుడు బాంబులు చూపిస్తూ బెదిరించాడు. అయితే చివరకు పోలీసులు రంగ ప్రవేశం చేసి అనేక మందిని అరెస్టు చేశారు.
Read Also: నాంపల్లిలో పట్టాలు తప్పిన చార్మినార్ ఎక్స్ప్రెస్
దేశంలోని పరిస్థితిని పరిగణనలోకి తీసుకున్న అధ్యక్షుడు డేనియల్ నోబోవా సోమవారం జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఈక్వెడార్లో 60 రోజుల ఎమర్జెన్సీని విధిస్తున్నట్లు తెలిపారు. ఇటీవల ఓ కరుడుగట్టిన గ్యాంగ్స్టర్ జైలు నుంచి తప్పించుకున్నాడు. చొనేరస్ గ్యాంగ్కు చెందిన గ్యాంగ్స్టర్ తప్పించుకోవడం వల్లే డ్రగ్ ముఠా ఈ దాడికి దిగినట్లు తెలుస్తోంది. బోర్డర్ వద్ద ప్రత్యేక బలగాలను మోహరించారు.
BREAKING: Gunmen storm TV channel in Ecuador, take hostages pic.twitter.com/UYQrYoOBcC
— BNO News (@BNONews) January 9, 2024