తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మజ్లిస్ పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్కు తమ పార్టీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీఎం కేసీఆర్ ఈ పదేళ్ల కాలంలో పేదల కోసం ఎన్నో పథకాలు తీసుకు వచ్చారని తెలిపారు. కేసీఆర్ విడుదల చేసిన బీఆర్ఎస్ మేనిఫెస్టో అద్భుతంగా ఉందని, ఆయన హ్యాట్రిక్ సీఎం అవుతారన్నారు అసదుద్దీన్ ఓవైసీ.
తెలంగాణలో బీఆర్ఎస్-మజ్లిస్ దోస్తీ మొదటి నుంచీ కొనసాగుతోందన్నారు అసదుద్దీన్ ఓవైసీ. మజ్లిస్ తమ మిత్రపక్షమని కేసీఆర్ చాలా సార్లు చెప్పారన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సుఖశాంతుల కోసం కేసీఆర్ను మళ్లీ గెలిపించాలన్నారు. బీజేపీ, కాంగ్రెస్ దొందూ దొందే అన్నారు. తెలంగాణతో పాటు రాజస్థాన్ ఎన్నికల్లోను పలు స్థానాల్లో తాము పోటీ చేస్తామని చెప్పారు అసదుద్దీన్ ఓవైసీ.
ఇది కూడా చదవండి: బీఆర్ఎస్ మెనిఫెస్టోతో కాంగ్రెస్, బీజేపీల్లో గుబులు