Saturday, May 18, 2024

పైశాచిక దాడి: బాలికను చంపేసి ఆపై గ్యాంగ్ రేప్!!

spot_img

మధ్యప్రదేశ్ లోని ఉజ్జయినిలో బాలికపై జరిగిన అత్యాచార ఘటన గురించి మరవక ముందే మరో దారుణం చోటుచేసుకుంది. అస్సాంలోని కరీంగంజ్ ప్రాంతంలో ఒక మైనర్ బాలిక దారుణ హత్యకు గురైంది. అనంతరం బాలిక మృతదేహంపై ముగ్గురు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ కేసులో ముగ్గురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు మైనర్‌ బాలికను బలవంతం చేయగా.. ఆ బాలిక నిరాకరించడంతో హత్య చేసినట్లు చెబుతున్నారు. నిందితులు బాలికను అత్యంత కిరాతకంగా హత్య చేసి అనంతరం బాలిక మృతదేహంపై ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు.

ఇది కూడా చదవండి: షుగర్ టెస్ట్ చేసేందుకు సరైన సమయం ఏదో తెలుసా?

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సెప్టెంబర్ 9న బాలిక ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో ముగ్గురు యువకులు బాలిక ఇంటికి వచ్చారు. వారి వయస్సు 25 నుండి 27 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం నివేదికలో బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. బాలికకు నిందితులు తెలుసని ప్రాథమిక విచారణలో తేలిందని, అందుకే వారిని ఇంట్లోకి వెళ్లేందుకు అనుమతించిందని కరీంగంజ్ ఎస్పీ పార్థ ప్రతిమ్ దాస్ తెలిపారు.

ఇది కూడా చదవండి: రూ. 2 వేల నోట్ల మార్పిడికి నేడే చివరి రోజు.. ఇక కనపడవు!!

పోస్ట్ మార్టం నివేదికలో ఆ బాలికను మొదట గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. ఆ తర్వాత బాలికపై లైంగిక దాడి జరిగినట్లు నిర్ధారించారు. ఈ ఘటనకు పాల్పడిన ముగ్గురు నిందితులను ఐపిసి సెక్షన్ 376 కింద అరెస్టు చేశారు. నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.

More News..

చిన్నారి దీక్షిత్ రెడ్డి హత్య కేసు: ముద్ధాయికి మరణ శిక్ష

Latest News

More Articles