హైదరాబాద్ : బోరబండలో హత్యాయత్నం కలకలం సృష్టించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉద్యోగాలు ఇప్పిస్తానని సమీర్ లక్షల్లో వసూలు చేశాడు. అనంతరం ఉద్యోగాలు రాకపోవడంతో డబ్బు తిరిగి ఇచ్చేయాలని బాధితుడు నర్సింహులు డిమాండ్ చేశాడు.
డబ్బు తిరిగి ఇచ్చేస్తానని నర్సింహులుని నిందితుడు సమీర్ ఇంటికి పిలిపించాడు. ఇంటికొచ్చిన నర్సింహులుపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఆర్తనాదాలు చేస్తూ బయటకు పరుగులు పెట్టడంతో స్థానికులు స్పందించి రక్షించారు. నర్సింహులు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.